Kerala Adivasi Man Madhu Case, HC Registers Suo Motu Case

3 views · 8y ago 🎲 Random

The Kerala High Court has registered a suo motu case in the instance of the tribal man Madhu, who was beaten to lost life by a mob at Attapadi. <br /> <br />ఆహారం దొంగిలించాడనే కోపంతో ఆదివాసీ యువకుడు మధు చిందకి అనే యువకుడిని కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అత్తపడిలో కేవలం బియ్యం దొంగిలించినందుకు ఓ గుంపు ఎగబడి మధును దారుణంగా కొట్టి చంపింది. ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కేరళ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ (కెల్సా) ఇన్‌చార్జ్‌గా ఉన్న జస్టిస్‌ కే సురేంద్రమోహన్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాశారు. దీంతో కేరళ హైకోర్టు స్పందించి ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది. <br />మతిస్థిమితం లేని ఆదివాసీ మధును కట్టేసి దారుణంగా కొట్టడమేకాకుండా.. అదేదో వినోద క్రీడ అయినట్లు ఆ సమయంలో కొందరు గాయాలతో విలవిలలాడుతున్న మధుతో సెల్ఫీలు, సెల్ఫీ వీడియోలు కూడా తీసుకున్నారు. ఈ దారుణం ఒక్క కేరళనే కాదు యావత్ దేశాన్ని కుదిపేసింది. <br />ఆదివాసీ యువకుడు మధును కొట్టిన ఘటనపై జస్టిస్‌ కే సురేంద్రమోహన్‌ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన మన సమాజానికి, రాష్ట్రానికి సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల అందరూ సిగ్గుతో తలదించుకోవాలి అంటూ తన లేఖలో సురేంద్రమోహన్‌ పేర్కొన్నారు. <br />మరోవైపు ఆదివాసీ యువకుడు మధును కొట్టి చంపిన ఘటనలోని తీవ్రత దృష్ట్యా దీనిని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా భావించి.. ఈ కేసును సుమోటోగా విచారించాలని కేరళ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అంటోనీ డొమినిక్‌నిర్ణయించారు. ‘ఇది సమాజానికి కళ్లు తెరిపించే ఘటన. సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను సమీక్షించి.. సమగ్ర మార్పులు చేయాల్సిన అవసరముంది..' అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.